Thursday, January 5, 2017

అతిథి

ఒక తల్లికి నలుగురు కూతుళ్లు వుండేవారు.
అందులో మొదటి అమ్మాయి పేరు విరిగిన,
రెండవ అమ్మాయి పేరు చిరిగిన,
మూడవ అమ్మాయి పేరు పాడయిపోయిన,
నాలుగవ అమ్మాయి పేరు చనిపోయిన...
ఇలా ఈ విధంగా ఆ తల్లి తన
కూతుళ్లకు పేర్లు పెట్టుకుంది.
.
ఒకరోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు.
.
అతనితో తల్లి అడుగుతూ... ‘‘మీరు కుర్చీలో
కూర్చుంటారా లేక చాప మీద కూర్చుంటారా?’’
.
అతిథి : ‘‘కుర్చీ మీద కూర్చుంటాను’’
.
తల్లి : ‘‘విరిగిన..! కుర్చీ తీసుకుని రా’’!
.
అతిథి : ‘‘వద్దులేండీ..! నేను చాపమీదే
కూర్చుంటాను’’
.
తల్లి : ‘‘చిరిగిన..! చాప తీసుకుని రా’’
.
అతిథి : ‘‘ఉండనివ్వండి... నేను కింద నేలపైనే
కూర్చుంటాను’’
.
అలా అని ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు.
.
కొద్దిసేపు తరువాత....
.
తల్లి : ‘‘మీరు టీ తీసుకుంటారా..
పాలు తీసుకుంటారా?’’
.
అతిథి : ‘‘టీ’’
.
తల్లి : ‘‘పాడయిపోయిన...! టీ తీసుకుని రామ్మా..’’
.
అతిథి : ‘‘వద్దు వద్దులెండి..
.
నేను పాలు తీసుకుంటాను’’
.
తల్లి : ‘‘చనిపోయిన..! ఆవు పాలు తీసుకుని
రామ్మా’’
.
ఈ మాటలు విన్న అతిథి ఏమీ తోచక అక్కడి నుంచి
పారిపోతాడు........😆😆😆😆

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version